Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:30 AM

పీహెచ్‌సీకి కరెంటివ్వండి.. వెంటనే ప్రారంభించండి!

పీహెచ్‌సీకి కరెంటివ్వండి.. వెంటనే ప్రారంభించండి!

పీహెచ్‌సీకి కరెంటివ్వండి.. వెంటనే ప్రారంభించండి!
15-07-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నూతన భవనాన్ని పరిశీలించిన సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

ప్రారంభానికి నోచుకోని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

మండలంలోని తంగడపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ సీపీఎం మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి తంగడపల్లి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.​అనంతరం జహంగీర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం రూపుదిద్దుకున్న ఈ నూతన ఆరోగ్య కేంద్రంలో భవనం,ఇతర మౌలిక వసతులు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ,కేవలం విద్యుత్ కనెక్షన్ లేకపోవడం వల్లే ప్రారంభానికి నోచుకోకుండా మూలన పడిందని మండిపడ్డారు.​​గ్రామీణ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ భవనానికి కరెంటు సౌకర్యం కల్పించాలి.​ఆసుపత్రికి అవసరమైన పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని,మందులను,వైద్య పరికరాలను వెంటనే ఏర్పాటు చేయాలి.​ఈ పీహెచ్‌సీ గనుక అందుబాటులోకి వస్తే తంగడపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా,గోశిక కరుణాకర్, బత్తుల దాసు,తూర్పునూరి మల్లేశం,కందగట్ల ఆనంద్, చికూరి ఈదయ్య,కనకయ్య, సిలువేరు జంగయ్య, రాములు,ఎండీ జావిద్, స్వామి,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ముత్యాలు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పీహెచ్‌సీకి కరెంటివ్వండి.. వెంటనే ప్రారంభించండి!

Article Image

నూతన భవనాన్ని పరిశీలించిన సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

ప్రారంభానికి నోచుకోని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

మండలంలోని తంగడపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ సీపీఎం మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి తంగడపల్లి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.​అనంతరం జహంగీర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం రూపుదిద్దుకున్న ఈ నూతన ఆరోగ్య కేంద్రంలో భవనం,ఇతర మౌలిక వసతులు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ,కేవలం విద్యుత్ కనెక్షన్ లేకపోవడం వల్లే ప్రారంభానికి నోచుకోకుండా మూలన పడిందని మండిపడ్డారు.​​గ్రామీణ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ భవనానికి కరెంటు సౌకర్యం కల్పించాలి.​ఆసుపత్రికి అవసరమైన పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని,మందులను,వైద్య పరికరాలను వెంటనే ఏర్పాటు చేయాలి.​ఈ పీహెచ్‌సీ గనుక అందుబాటులోకి వస్తే తంగడపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా,గోశిక కరుణాకర్, బత్తుల దాసు,తూర్పునూరి మల్లేశం,కందగట్ల ఆనంద్, చికూరి ఈదయ్య,కనకయ్య, సిలువేరు జంగయ్య, రాములు,ఎండీ జావిద్, స్వామి,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ముత్యాలు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News