భువనగిరి పట్టణలో ప్రజా బాట కార్యక్రమం
భువనగిరి పట్టణలో ప్రజా బాట కార్యక్రమం
Sthanikam District Staff Reporter
పాత లైన్ల స్థానంలో కొత్త లైన్లు ఏర్పాటు చేస్తాం:భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సహకారంతో,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని 1,2,7,15,16, 34వ వార్డులలో (వాక్ ఆన్ లైన్) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ విద్యుత్ అధికారులతో కలిసి పలు వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా వంగిపోయిన,పాడైపోయిన విద్యుత్ స్తంభాలు,పాత ట్రాన్స్ఫార్మర్లు మరియు శిథిలావస్థలో ఉన్న విద్యుత్ లైన్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానికులు చైర్మన్ కు వినతి పత్రం అందజేస్తూ,వంగిపోయిన మరియు పాడైపోయిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను,పాత ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లను,అలాగే పాత లైన్ల స్థానంలో కొత్త విద్యుత్ లైన్లను వెంటనే నూతనంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల వినతులపై సానుకూలంగా స్పందించిన చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి మాట్లాడుతూ,"ప్రజల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వంగిన స్తంభాలు,పాత ట్రాన్స్ఫార్మర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి,పాత స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు,పాత లైన్ల స్థానంలో కొత్త లైన్లు మరియు కొత్త స్తంభాలను నూతనంగా ఏర్పాటు చేస్తాం. త్వరలోనే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది"అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని,ప్రతి వార్డులోని సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తామని చైర్మన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో
యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్.ఈ కె.సురేష్,డిఈ.సంఘం వెంకటేశ్వర్లు, ఏడిఈ.పానుగంటి రవీంద్ర చారి,భువనగిరి టౌన్ ఏడిఈ.సాయి కృష్ణ,భువనగిరి రూరల్ ఏడిఈ.వెంకటేశ్వర్లు,విద్యుత్ శాఖ భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్లు
ఏలే భువనేశ్వరి,పోలిశెట్టి అనిల్ కుమార్,కుక్కతో పద్మావతి,బొజ్జయిని శారద,చెన్నా స్వాతి,సరిగడ రాజ్యలక్ష్మి, నాజియా రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి