Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 05:35 PM

పెద్దపల్లిలో మరో ‘కట్టల’ కబంధం..! రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ సతీశ్

పెద్దపల్లిలో మరో ‘కట్టల’ కబంధం..! రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ సతీశ్

పెద్దపల్లిలో మరో ‘కట్టల’ కబంధం..! రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ సతీశ్
July 14, 2026 02:47 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పెద్దపల్లి: మున్సిపల్ పనుల బిల్లుల విడుదల కోసం భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సతీశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని ఏఈ సతీశ్ ఓ కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేసినట్లు సమాచారం. అధికారుల వేధింపులతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా, ఫిర్యాదును స్వీకరించిన డీఎస్పీ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని బృందం పక్కా వ్యూహంతో ట్రాప్ నిర్వహించింది.

ముందస్తు ప్రణాళిక ప్రకారం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు దాడి చేసి సతీశ్‌ను పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు.

పెద్దపల్లిలో పెరుగుతున్న ఏసీబీ ఉచ్చు

జిల్లాలో అవినీతి అధికారులపై ఏసీబీ వరుస చర్యలు చేపడుతోంది. గత ఏడాది జూలైలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ జగదీష్ బాబు రూ.90 వేల లంచం తీసుకుంటూ పట్టుబడగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మంథని సబ్‌రిజిస్ట్రార్ రూ.16,500 లంచం స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఏఈ అరెస్టుతో అవినీతి అధికారుల్లో కలవరం నెలకొంది.

లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండిఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

టోల్ ఫ్రీ : 1064

వాట్సాప్ : 94404 46106

"బిల్లుల కోసం లంచం.. ఏసీబీ ట్రాప్‌లో మున్సిపల్ ఏఈ" ఘటన పెద్దపల్లి జిల్లాలో మరోసారి అవినీతి వ్యవహారాలపై చర్చకు తెరలేపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News