పెద్దపల్లిలో మరో ‘కట్టల’ కబంధం..! రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ సతీశ్
పెద్దపల్లిలో మరో ‘కట్టల’ కబంధం..! రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ సతీశ్
Komidala Mahender reddy
పెద్దపల్లి: మున్సిపల్ పనుల బిల్లుల విడుదల కోసం భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సతీశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని ఏఈ సతీశ్ ఓ కాంట్రాక్టర్ను డిమాండ్ చేసినట్లు సమాచారం. అధికారుల వేధింపులతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా, ఫిర్యాదును స్వీకరించిన డీఎస్పీ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని బృందం పక్కా వ్యూహంతో ట్రాప్ నిర్వహించింది.
ముందస్తు ప్రణాళిక ప్రకారం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు దాడి చేసి సతీశ్ను పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
పెద్దపల్లిలో పెరుగుతున్న ఏసీబీ ఉచ్చు
జిల్లాలో అవినీతి అధికారులపై ఏసీబీ వరుస చర్యలు చేపడుతోంది. గత ఏడాది జూలైలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ జగదీష్ బాబు రూ.90 వేల లంచం తీసుకుంటూ పట్టుబడగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మంథని సబ్రిజిస్ట్రార్ రూ.16,500 లంచం స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఏఈ అరెస్టుతో అవినీతి అధికారుల్లో కలవరం నెలకొంది.
లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండిఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
టోల్ ఫ్రీ : 1064
వాట్సాప్ : 94404 46106
"బిల్లుల కోసం లంచం.. ఏసీబీ ట్రాప్లో మున్సిపల్ ఏఈ" ఘటన పెద్దపల్లి జిల్లాలో మరోసారి అవినీతి వ్యవహారాలపై చర్చకు తెరలేపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి