Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే లక్ష్యం.. నేర నియంత్రణపై డీఐజీ జోయెల్ డేవిస్ దిశానిర్దేశం నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 09:57 PM

శాంతిభద్రతల పరిరక్షణే తొలి ప్రాధాన్యం.ఎస్‌ఐ సతీష్ గౌపతి

శాంతిభద్రతల పరిరక్షణే తొలి ప్రాధాన్యం.ఎస్‌ఐ సతీష్ గౌపతి

శాంతిభద్రతల పరిరక్షణే తొలి ప్రాధాన్యం.ఎస్‌ఐ సతీష్ గౌపతి
July 13, 2026 08:08 PM 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు.

ప్రజలకు అందుబాటులో పారదర్శక పోలీసింగ్‌.

రామన్నపేట పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై రాజీలేని చర్యలు ఉంటాయని రామన్నపేట ఎస్‌ఐ సతీష్ గౌపతి స్పష్టం చేశారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక పోలీసింగ్‌ను అమలు చేస్తామని తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు, నేరాలకు పాల్పడే వ్యక్తులపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, సందేశాలను నమ్మవద్దని సూచించారు. మోసాలకు గురైన వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.

యువత మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన ఎస్‌ఐ, ప్రజల సహకారంతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రశాంత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News