శాంతిభద్రతల పరిరక్షణే తొలి ప్రాధాన్యం.ఎస్ఐ సతీష్ గౌపతి
శాంతిభద్రతల పరిరక్షణే తొలి ప్రాధాన్యం.ఎస్ఐ సతీష్ గౌపతి
Editor Desk
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు.
ప్రజలకు అందుబాటులో పారదర్శక పోలీసింగ్.
రామన్నపేట పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై రాజీలేని చర్యలు ఉంటాయని రామన్నపేట ఎస్ఐ సతీష్ గౌపతి స్పష్టం చేశారు. సోమవారం పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక పోలీసింగ్ను అమలు చేస్తామని తెలిపారు.
పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు, నేరాలకు పాల్పడే వ్యక్తులపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, సందేశాలను నమ్మవద్దని సూచించారు. మోసాలకు గురైన వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.
యువత మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన ఎస్ఐ, ప్రజల సహకారంతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రశాంత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి