ఖతార్ మాజీ అమీర్కు భారత నివాళి.. నల్లగొండలో అరస్థాయికి జాతీయ పతాకం
ఖతార్ మాజీ అమీర్కు భారత నివాళి.. నల్లగొండలో అరస్థాయికి జాతీయ పతాకం
Komidala Mahender reddy
నల్లగొండ, జూలై 13: ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం దేశవ్యాప్తంగా ఒక రోజు జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు నల్లగొండ గడియారం సెంటర్ వద్ద జాతీయ పతాకాన్ని అరస్థాయిలో ఎగురవేశారు. అలాగే అధికారిక ప్రభుత్వ వినోద కార్యక్రమాలను రద్దు చేశారుభారత్కు మిత్రదేశంగా ఉన్న ఖతార్ మాజీ దేశాధినేత మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నల్లగొండలో కూడా అధికారులు నిబంధనల ప్రకారం జాతీయ పతాకాన్ని సగం వరకు దించి గౌరవ నివాళి అర్పించారు.
మిత్రదేశాల ప్రస్తుత లేదా మాజీ దేశాధినేతలు మరణించిన సందర్భాల్లో భారత ప్రభుత్వం జాతీయ సంతాపాన్ని ప్రకటించి, జాతీయ పతాకాన్ని అరస్థాయిలో ఎగురవేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారిక వినోద కార్యక్రమాలు కూడా నిలిపివేయబడ్డా యి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి