లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Biksham
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు కేతావత్ శంకర్ నాయక్ సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా పెన్పహాడ్ మండలం తంగేళ్లగూడెంకు చెందిన దేశగాని రామకృష్ణ, అబ్బగాని వెంకటయ్య, దోసపహాడ్ గ్రామానికి చెందిన కడవంచి వెంకటమ్మలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు అనారోగ్య సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, తంగేళ్లగూడెం సర్పంచ్ పందుల వెంకటేశ్వర్లు, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు సంకరమద్ది సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి