విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్
విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్
Editor Desk
తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్లగొండ పట్టణంలోని విశ్వకర్మ భవన్లో జిల్లా అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం చారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమావేశంలో కొత్త కమిటీని ప్రకటించారు.
నూతన కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా గుంటోజు వెంకటాచారి, ఉపాధ్యక్షుడిగా శిరసనగండ్ల ఈశ్వరాచారి, కోశాధికారిగా సంకోజు జేజయ్య, ప్రచార కార్యదర్శిగా పోలోజు శివకుమార్, సహాయ కార్యదర్శిగా తుంగతుర్తి శంకర్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ, తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకోజు కృష్ణమాచారి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు చక్రహరి రామరాజు, గౌరవాధ్యక్షుడు కుందారపు గణేష్ చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికొండ శ్రీరాములు, రాష్ట్ర కోశాధికారి గంధాల శ్రీనివాస చారి, కార్యదర్శులు కేకే చారి, ఆనందోజు సత్యనారాయణ, ఉప్పల లక్ష్మీనారాయణ, ఉడుముల బ్రహ్మచారి, పోలోజు రమేష్ చారి, రామరాజు, వివిధ మండలాల కమ్మరి, వడ్రంగి, విశ్వకర్మ మనుమయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి