Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:16 AM

విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్

విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్

విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్
12-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్లగొండ పట్టణంలోని విశ్వకర్మ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం చారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమావేశంలో కొత్త కమిటీని ప్రకటించారు.

నూతన కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా గుంటోజు వెంకటాచారి, ఉపాధ్యక్షుడిగా శిరసనగండ్ల ఈశ్వరాచారి, కోశాధికారిగా సంకోజు జేజయ్య, ప్రచార కార్యదర్శిగా పోలోజు శివకుమార్, సహాయ కార్యదర్శిగా తుంగతుర్తి శంకర్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ, తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకోజు కృష్ణమాచారి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు చక్రహరి రామరాజు, గౌరవాధ్యక్షుడు కుందారపు గణేష్ చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికొండ శ్రీరాములు, రాష్ట్ర కోశాధికారి గంధాల శ్రీనివాస చారి, కార్యదర్శులు కేకే చారి, ఆనందోజు సత్యనారాయణ, ఉప్పల లక్ష్మీనారాయణ, ఉడుముల బ్రహ్మచారి, పోలోజు రమేష్ చారి, రామరాజు, వివిధ మండలాల కమ్మరి, వడ్రంగి, విశ్వకర్మ మనుమయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్

Article Image

తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్లగొండ పట్టణంలోని విశ్వకర్మ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం చారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమావేశంలో కొత్త కమిటీని ప్రకటించారు.

నూతన కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా గుంటోజు వెంకటాచారి, ఉపాధ్యక్షుడిగా శిరసనగండ్ల ఈశ్వరాచారి, కోశాధికారిగా సంకోజు జేజయ్య, ప్రచార కార్యదర్శిగా పోలోజు శివకుమార్, సహాయ కార్యదర్శిగా తుంగతుర్తి శంకర్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ, తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకోజు కృష్ణమాచారి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు చక్రహరి రామరాజు, గౌరవాధ్యక్షుడు కుందారపు గణేష్ చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికొండ శ్రీరాములు, రాష్ట్ర కోశాధికారి గంధాల శ్రీనివాస చారి, కార్యదర్శులు కేకే చారి, ఆనందోజు సత్యనారాయణ, ఉప్పల లక్ష్మీనారాయణ, ఉడుముల బ్రహ్మచారి, పోలోజు రమేష్ చారి, రామరాజు, వివిధ మండలాల కమ్మరి, వడ్రంగి, విశ్వకర్మ మనుమయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News