ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు
Krishna
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గంలో పర్యటించి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో చౌటకూరు, పుల్కల్, జోగిపేట మున్సిపాలిటీ, ఆందోల్, అల్లదుర్గ్, వట్పల్లి మండలాల్లో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి జూలై 24లోపు పూర్తిచేయాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సక్రమంగా నింపడంలో ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని, బూత్ల వారీగా రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకుని అలసత్వం లేకుండా పనిచేయాలని బీఎల్ఏలకు సూచించారు. అలాగే బూత్ లెవల్ అధికారులతో (బీఎల్ఓలు) సమన్వయం చేసుకుంటూ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి ఆందోల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీసీసీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డా. రాజీవ్, జగన్ మోహన్ రెడ్డి, సురేందర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, చిట్టిబాబు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి