Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు

ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు

ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు
11-07-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గంలో పర్యటించి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో చౌటకూరు, పుల్కల్, జోగిపేట మున్సిపాలిటీ, ఆందోల్, అల్లదుర్గ్, వట్పల్లి మండలాల్లో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి జూలై 24లోపు పూర్తిచేయాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సక్రమంగా నింపడంలో ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని, బూత్‌ల వారీగా రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకుని అలసత్వం లేకుండా పనిచేయాలని బీఎల్‌ఏలకు సూచించారు. అలాగే బూత్ లెవల్ అధికారులతో (బీఎల్‌ఓలు) సమన్వయం చేసుకుంటూ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి ఆందోల్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీసీసీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డా. రాజీవ్, జగన్ మోహన్ రెడ్డి, సురేందర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, చిట్టిబాబు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు

Article Image

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గంలో పర్యటించి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో చౌటకూరు, పుల్కల్, జోగిపేట మున్సిపాలిటీ, ఆందోల్, అల్లదుర్గ్, వట్పల్లి మండలాల్లో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి జూలై 24లోపు పూర్తిచేయాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సక్రమంగా నింపడంలో ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని, బూత్‌ల వారీగా రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకుని అలసత్వం లేకుండా పనిచేయాలని బీఎల్‌ఏలకు సూచించారు. అలాగే బూత్ లెవల్ అధికారులతో (బీఎల్‌ఓలు) సమన్వయం చేసుకుంటూ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి ఆందోల్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీసీసీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డా. రాజీవ్, జగన్ మోహన్ రెడ్డి, సురేందర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, చిట్టిబాబు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News