Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:14 PM

మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్

మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్

మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్
July 11, 2026 11:17 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;రాష్ట్రంలో రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రైతుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డిని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.తుంగతుర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.రైతు భరోసా పథకం కింద తక్కువ సమయంలోనే వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందిస్తూ వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తోందన్నారు.వర్షపాతం, శాస్త్రవేత్తల సూచనలను అనుసరించి రైతులు పంటల సాగు చేయాలని సూచించారు.నూతనకల్ మండలంలోని సీలింగ్ భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో భూముల సర్వే, పట్టాల పంపిణీ ప్రక్రియ వేగవంతమైందని, వేలాది మంది రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, రైతులు, పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు ఆర్థిక సహాయం వంటి పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని వివరించారు.తుంగతుర్తి నియోజకవర్గంలో సీసీ రోడ్లు, విద్యాసంస్థలు, మినీ స్టేడియం, ఇండస్ట్రియల్ పార్క్, రహదారులు తదితర అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రకటించిన 9 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాలపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించారు. అర్హతలు లేని వారిని మండల అధ్యక్షులుగా ఎంపిక చేశారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన నిబంధనలు, అర్హతలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే మండల అధ్యక్షుల నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.కొంతమంది కావాలనే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు లభిస్తుందని, పార్టీ నిర్ణయాలను ప్రతి నాయకుడు, కార్యకర్త గౌరవించాలని పిలుపునిచ్చారు.గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని 9 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News