Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:17 AM

అర్ధరాత్రి మంటలు.. రోడ్డుపై కూలిన భారీ వేపచెట్టు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చొరవతో ట్రాఫిక్‌కు వెంటనే విముక్తి

అర్ధరాత్రి మంటలు.. రోడ్డుపై కూలిన భారీ వేపచెట్టు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చొరవతో ట్రాఫిక్‌కు వెంటనే విముక్తి

అర్ధరాత్రి మంటలు.. రోడ్డుపై కూలిన భారీ వేపచెట్టు   సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చొరవతో ట్రాఫిక్‌కు వెంటనే విముక్తి
11-07-2026 472 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రపాలనగరంలో భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారి పక్కన ఉన్న భారీ వేపచెట్టుకు అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపటికే చెట్టు రోడ్డుపై అడ్డంగా కూలిపోవడంతో రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.

సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం జేసీబీ సాయంతో రోడ్డుపై అడ్డంగా పడిన వేపచెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


సమయానికి అధికారులు, సర్పంచ్ స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో కొంతసేపు భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగాయి.

Sthanikam

అర్ధరాత్రి మంటలు.. రోడ్డుపై కూలిన భారీ వేపచెట్టు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చొరవతో ట్రాఫిక్‌కు వెంటనే విముక్తి

Article Image

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రపాలనగరంలో భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారి పక్కన ఉన్న భారీ వేపచెట్టుకు అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపటికే చెట్టు రోడ్డుపై అడ్డంగా కూలిపోవడంతో రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.

సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం జేసీబీ సాయంతో రోడ్డుపై అడ్డంగా పడిన వేపచెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


సమయానికి అధికారులు, సర్పంచ్ స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో కొంతసేపు భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News