భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రపాలనగరంలో భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారి పక్కన ఉన్న భారీ వేపచెట్టుకు అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపటికే చెట్టు రోడ్డుపై అడ్డంగా కూలిపోవడంతో రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.
సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం జేసీబీ సాయంతో రోడ్డుపై అడ్డంగా పడిన వేపచెట్టును తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
సమయానికి అధికారులు, సర్పంచ్ స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో కొంతసేపు భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి