Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పూర్తిస్థాయి కమిషనర్‌ను వెంటనే నియమించాలి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల డిమాండ్. నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 06:44 PM

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత!

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత!

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత!
July 10, 2026 05:25 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

10 పశువుల స్వాధీనం, వాహనం సీజ్, డ్రైవర్ అరెస్ట్

అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని చౌటుప్పల్ పోలీసులు పంతంగి టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఎస్హెచ్‌ఓ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కె. రాంబాబు, కానిస్టేబుల్ సీతారాం రెడ్డిలు పెట్రో మొబైల్-1 వాహనంలో విధుల్లో ఉండగా అందిన సమాచారం మేరకు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు.​ఈ తనిఖీల్లో అశోక్ లేలాండ్ (TS 29 TA 4895) వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 5 ఆవులు, 5 ఎద్దులు (మొత్తం 10 పశువులు) లభ్యమయ్యాయి. డ్రైవర్‌ను విచారించగా అతని పేరు ఎస్కే కరీముల్లా బాబా (22), స్వస్థలం సూర్యాపేట జిల్లా నడిగూడెం అని తెలిపాడు. కోదాడ సంతలో పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు.ఈ మేరకు పశువులను, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News