సర్ (ఎస్ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి
సర్ (ఎస్ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి
Anjali
నల్లమాడ గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా 133, 134, 135 పోలింగ్ బూత్లను సందర్శించి, బీఎల్వోలు నిర్వహిస్తున్న ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆన్లైన్లో నమోదు ఎలా జరుగుతోందో అధికారులను అడిగి తెలుసుకుని, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు అయ్యేలా పూర్తి పారదర్శకతతో పని చేయాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని బీఎల్వోలకు దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో మండల కన్వీనర్ శంకర, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మంజు రెడ్డి, యూనిట్ ఇన్చార్జ్ చంద్ర రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మణికుమారితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి