Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:36 AM

సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి

సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి

సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి
11-07-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

నల్లమాడ గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా 133, 134, 135 పోలింగ్ బూత్‌లను సందర్శించి, బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆన్‌లైన్‌లో నమోదు ఎలా జరుగుతోందో అధికారులను అడిగి తెలుసుకుని, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు అయ్యేలా పూర్తి పారదర్శకతతో పని చేయాలని సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని బీఎల్‌వోలకు దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో మండల కన్వీనర్ శంకర, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మంజు రెడ్డి, యూనిట్ ఇన్‌చార్జ్ చంద్ర రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మణికుమారితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి

Article Image

నల్లమాడ గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా 133, 134, 135 పోలింగ్ బూత్‌లను సందర్శించి, బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆన్‌లైన్‌లో నమోదు ఎలా జరుగుతోందో అధికారులను అడిగి తెలుసుకుని, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు అయ్యేలా పూర్తి పారదర్శకతతో పని చేయాలని సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని బీఎల్‌వోలకు దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో మండల కన్వీనర్ శంకర, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మంజు రెడ్డి, యూనిట్ ఇన్‌చార్జ్ చంద్ర రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మణికుమారితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News