Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:32 PM

మిర్యాలగూడ ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు

మిర్యాలగూడ ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు

మిర్యాలగూడ ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు
July 11, 2026 02:57 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశం

మిర్యాలగూడ, జూలై 11 (ప్రజాప్రతినిధి): నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలోని వివిధ వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్య సిబ్బంది పనితీరు, మందుల లభ్యత, రోగుల సమస్యలపై ఆరా తీశారు.

ముఖ్యంగా బాలింతల వార్డును సందర్శించిన ఎమ్మెల్యే, అక్కడ చికిత్స పొందుతున్న తల్లులు, శిశువుల ఆరోగ్య పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల పంపిణీ విధానం, సిబ్బంది స్పందనపై రోగులను నేరుగా అడిగి వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వర్షాకాలం నేపథ్యంలో ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు దోమలు, అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆస్పత్రిలో అవసరమైన మౌలిక వసతుల కొరతపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.

ఆయన వెంట వైద్యాధికారులు, ఆస్పత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News