Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:33 AM

గానకోకిల మూగబోయింది.. భారత సంగీత లోకానికి తీరని లోటు

గానకోకిల మూగబోయింది.. భారత సంగీత లోకానికి తీరని లోటు

గానకోకిల మూగబోయింది.. భారత సంగీత లోకానికి తీరని లోటు
11-07-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మైసూరు: భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు.

దాదాపు ఆరు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా మొత్తం 20 భాషల్లో సుమారు 48 వేల పాటలు ఆలపించి అరుదైన రికార్డు సృష్టించారు. తన స్వర మాధుర్యంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆమెను అభిమానులు ప్రేమగా "గానకోకిల"గా పిలుచుకునేవారు.

జానకి మరణ వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, భారత సంగీత రంగానికి ఆమె అందించిన సేవలను స్మరించుకున్నారు.

జానకి మరణంతో భారతీయ సంగీత ప్రపంచం ఓ గొప్ప గాన మాణిక్యాన్ని కోల్పోయిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Sthanikam

గానకోకిల మూగబోయింది.. భారత సంగీత లోకానికి తీరని లోటు

Article Image

మైసూరు: భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు.

దాదాపు ఆరు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా మొత్తం 20 భాషల్లో సుమారు 48 వేల పాటలు ఆలపించి అరుదైన రికార్డు సృష్టించారు. తన స్వర మాధుర్యంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆమెను అభిమానులు ప్రేమగా "గానకోకిల"గా పిలుచుకునేవారు.

జానకి మరణ వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, భారత సంగీత రంగానికి ఆమె అందించిన సేవలను స్మరించుకున్నారు.

జానకి మరణంతో భారతీయ సంగీత ప్రపంచం ఓ గొప్ప గాన మాణిక్యాన్ని కోల్పోయిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News