గానకోకిల మూగబోయింది.. భారత సంగీత లోకానికి తీరని లోటు
గానకోకిల మూగబోయింది.. భారత సంగీత లోకానికి తీరని లోటు
Komidala Mahender reddy
మైసూరు: భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు.
దాదాపు ఆరు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా మొత్తం 20 భాషల్లో సుమారు 48 వేల పాటలు ఆలపించి అరుదైన రికార్డు సృష్టించారు. తన స్వర మాధుర్యంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆమెను అభిమానులు ప్రేమగా "గానకోకిల"గా పిలుచుకునేవారు.
జానకి మరణ వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, భారత సంగీత రంగానికి ఆమె అందించిన సేవలను స్మరించుకున్నారు.
జానకి మరణంతో భారతీయ సంగీత ప్రపంచం ఓ గొప్ప గాన మాణిక్యాన్ని కోల్పోయిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి