Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 07:39 AM

నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ!

నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ!

నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ!
July 12, 2026 06:27 AM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

జింకకు ఎలాంటి హాని జరగనివ్వం.. నల్గొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు

నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోకి దారి తప్పి వచ్చిన ఓ జింక స్థానికంగా ఆసక్తి, ఆందోళనకు కారణమైంది. కళాశాల పరిసరాల్లో జింక సంచరిస్తున్న సమాచారం అందుకున్న వెంటనే విద్యార్ధులు అటవీశాఖ కు ఇచ్చిన సమాచారమునకు స్పందించిన అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. నల్గొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు ఆధ్వర్యంలో అధికారులు కళాశాల ప్రాంగణాన్ని సందర్శించి జింక కదలికలను నిశితంగా గమనించారు.

ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు మాట్లాడుతూ, కళాశాల పరిసర ప్రాంతం చెట్లు, పచ్చదనం ఎక్కువగా ఉండటంతో అడవిని తలపించే వాతావరణం ఏర్పడిందని, అందువల్ల జింక ప్రస్తుతం ప్రశాంతంగానే సంచరిస్తోందని తెలిపారు. జింక ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, దానికి ఎటువంటి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

జింక సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సంబంధిత బీట్ ఫారెస్ట్ అధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు ఆయన వెల్లడించారు. జింక కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, దాని ఆరోగ్య పరిస్థితి, భద్రతపై అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నారని వివరించారు. పరిస్థితిని బట్టి అవసరమైతే జింకను అత్యంత సురక్షితంగా దాని సహజ ఆవాసమైన అటవీ ప్రాంతానికి తరలించే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రజలకు, ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు అటవీశాఖ కీలక విజ్ఞప్తి చేసింది. జింకను వెంబడించడం, ఫోటోలు లేదా వీడియోల కోసం దగ్గరకు వెళ్లడం, భయపెట్టడం వంటి చర్యలు చేయవద్దని అధికారులు సూచించారు. అలాంటి చర్యల వల్ల జింక భయాందోళనకు గురై తనకే కాకుండా పరిసరాల్లో ఉన్నవారికీ ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. జింక స్వేచ్ఛగా సంచరించేలా ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని కోరారు.

అటవీశాఖ అధికారులు కళాశాల యాజమాన్యంతో కూడా సమన్వయం చేసుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అయితే జింకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహకరించాలని సూచించారు. వన్యప్రాణులు అప్పుడప్పుడు దారి తప్పి జనావాసాల్లోకి రావడం సహజమేనని, అలాంటి సందర్భాల్లో ప్రజలు సంయమనం పాటించి వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని అధికారులు పేర్కొన్నారు.

వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, జింక సురక్షితంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని నల్గొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News