గ్రామీణ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
గ్రామీణ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నారాయణఖేడ్లోని తన నివాసంలో ఎన్ఆర్ఎల్ఎమ్ (సీఐఎఫ్) పథకం కింద బాచేపల్లి గ్రామానికి చెందిన సాఫీజా బేగం, శ్రీరామ్ విజయ్లకు మేకల పెంపకం యూనిట్ల కోసం ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షల ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో ఆదాయ వనరులను పెంచుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్,ఏపీఎం వంశీకృష్ణ ,మోహన్రెడ్డి, బసవరాజ్, నగేష్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి