'ఎస్ఐఆర్' ప్రక్రియను నెల రోజులు పొడిగించాలి: సీపీఐ డిమాండ్
'ఎస్ఐఆర్' ప్రక్రియను నెల రోజులు పొడిగించాలి: సీపీఐ డిమాండ్
K.RAVI
ఓటర్లను చైతన్యం చేయడంలో యంత్రాంగం విఫలం
బీజేపీ వ్యతిరేక ఓట్ల తొలగింపు కుట్ర ఆపాలి
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగోని సత్యనారాయణ
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా నిర్వహిస్తున్న 'ఎస్ఐఆర్' ప్రక్రియను మరో నెల రోజుల పాటు పొడిగించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగోని సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం జరిగిన సీపీఐ మండల సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఓటర్లను చైతన్యం చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇప్పటివరకు చాలా మందికి ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారాలు ఎలా నింపాలో అవగాహన లేక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఫారాలు పంపిణీ చేయకుండా, ఓటర్లనే తమ వద్దకు రావాలని చెప్పడం సరికాదన్నారు.గ్రామ స్థాయిలో వెంటనే గ్రామ సభలు నిర్వహించి, ఓటర్లకు సరైన అవగాహన కల్పించేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలే తప్ప, అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్రగా మారకూడదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల గుర్తింపు ఆలస్యమవుతున్నందున.. గడువును మరో నెల రోజులు పొడిగించి, అర్హులైన ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండీ. ఇమ్రాన్, మున్సిపాలిటీ కార్యదర్శి పగిల్ల మోహన్ రెడ్డి, నాయకులు ఉడత రామలింగం, కొండూరి వెంకటేష్, దాసరి అంజయ్య, టంగుటూరు రాములు, రోషణగారి అంజయ్య, రొండి నర్సింహా, బద్దుల సుధాకర్, నీళ్ల బిక్షపతి, కాకి పాండు, కుంటి పాపయ్య, దాసరి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి