Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:18 PM

'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత

'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత

'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత
July 11, 2026 06:07 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పదో తరగతి ఫలితాల్లో టాపర్లుగా యశస్విని, హర్షవర్ధిని, హర్షిత

ఇంటర్ ‘ఎంపీసీ’లో స్టేట్ ర్యాంక్ సాధించిన పూర్వ విద్యార్థిని వి. అక్షిత

ప్రతిభావంతులకు నగదు బహుమతులు అందజేసిన యాజమాన్యం

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 'ది ఐరా' గ్లోబల్ హైస్కూల్ విద్యార్థులు విద్యా సంవత్సరం (2025-2026) ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి పాఠశాల కీర్తిని చాటారు. పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన టాపర్లను, అలాగే ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ సాధించిన పూర్వ విద్యార్థినిని పాఠశాల ఆవరణలో ఘనంగా సత్కరించారు. ​పదో తరగతి టాపర్లలో సి.హెచ్. యశస్విని 600 మార్కులకు గానూ 549 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, ఎస్. హర్షవర్ధిని 534 మార్కులతో ద్వితీయ స్థానంలో, బి. హర్షిత 499 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచి తమ ప్రతిభను చాటుకున్నారు.​పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థిని వి. అక్షిత ఇంటర్మీడియట్ (ఎంపీసీ) ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గానూ 468 మార్కులు సాధించి అద్భుతమైన 'స్టేట్ ర్యాంక్' కైవసం చేసుకుంది. పాఠశాల చైర్మన్ అరుణ, కరస్పాండెంట్ శ్రీకాంత్ చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని టాపర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News