రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన నూతన తుంగతుర్తి నియోజకవర్గ మండల అధ్యక్షులు
రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన నూతన తుంగతుర్తి నియోజకవర్గ మండల అధ్యక్షులు
Bandi Kiran Kumar
తుంగతుర్తి నియోజకవర్గం లోని ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన 9 మండలల అధ్యక్షులు శనివారం నాడు తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మందుల సామెల్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రాష్ట్ర టి పి సి సి అధ్యక్షులు బొమ్మమహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారినిశాలువాతో ఘనంగా సన్మానించారు. తుంగతుర్తి నియోజకవర్గం లోనూతనంగా ఎన్నుకోబడిన 9 మండలాల అధ్యక్షులు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరంరాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి గ్రామస్థాయి నుంచి పార్టీ చేసే అంశాలపై పిసిసి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... తుంగతుర్తి నియోజకవర్గం లోని ఎలాంటి వర్గ బేధాలు లేకుండా నాయకులను, కార్యకర్తలను, సమన్వయంతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీనీ మరింత బలోపేతం కోసం కృషి చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని మండల అధ్యక్షులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 9 మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి