Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి 50 ఏళ్లు.. సహచరులతో ఆత్మీయంగా గడిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 07:45 PM

నియోజకవర్గం, 100 పడకల ఆస్పత్రికి మంత్రి కోమటిరెడ్డి హామీ. కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ సాధన సమితి

నియోజకవర్గం, 100 పడకల ఆస్పత్రికి మంత్రి కోమటిరెడ్డి హామీ. కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ సాధన సమితి

నియోజకవర్గం, 100 పడకల ఆస్పత్రికి మంత్రి కోమటిరెడ్డి హామీ. కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ సాధన సమితి
July 12, 2026 06:26 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించడంపై రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. ప్రజల దశాబ్దాల డిమాండ్‌కు మంత్రి సానుకూలంగా స్పందించడం శుభపరిణామమని సమితి నాయకులు పేర్కొన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ప్రకటనతో రామన్నపేట ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని తెలిపారు. నియోజకవర్గ పునర్విభజనలో రామన్నపేటకు స్థానం కల్పించేందుకు, ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు మంత్రి ఇచ్చిన హామీ ప్రజల ఆకాంక్షలకు బలాన్ని చేకూర్చిందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలకు రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధుల సేవలను కొనియాడారు.

కృతజ్ఞతలు తెలిపిన వారిలో సాధన సమితి గౌరవ అధ్యక్షుడు రెబ్బస్ రాములు, అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్, కార్యదర్శి గడ్డం యాదగిరి, ఎండి ఫజల్, పెండం రవీందర్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. రామన్నపేట ప్రజల చిరకాల ఆకాంక్షలను ప్రభుత్వం త్వరలోనే కార్యరూపంలోకి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News