చౌటుప్పల్, జూలై 12: చౌటుప్పల్లోని ఎంఎస్ గార్డెన్స్లో ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి సోదరుడు వరికుప్పల వెంకటేష్–నిర్మల దంపతుల కుమార్తె మానస వివాహ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోదాస్ లక్ష్మీనారాయణ, చేనేత సహకార సంఘం అధ్యక్షులు రవ్వ నరసింహ, మాజీ ఉపసర్పంచ్ సింగనబోయిన జంగయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మంటి లింగస్వామి, పల్లపు శ్రీను, బోదాస్ నరేష్, వరికుప్పల భాస్కర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి