మాసశివరాత్రి సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు
మాసశివరాత్రి సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు
Biksham
సూర్యాపేట టౌన్ మాసశివరాత్రి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఎంఆర్వో కార్యాలయం సమీపంలోని శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఆలయాన్ని సందర్శించి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు, అర్చనలు, హారతులు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాపర్తి నాగరాజు, వెన్న ఉపేందర్, పట్టణ కాంగ్రెస్ నాయకులు షేక్ రహీం, కోడి కిరణ్, నర్సింగ్ కిరణ్, షేక్ గౌస్ పాషా, పిల్లల నాగరాజు, రావుల రమేష్, మైనార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుడు షేక్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి