Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 02:38 PM

ఓటు హక్కును కాపాడుకుందాం. ఓటర్ల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలి: కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుండాల సతీష్

ఓటు హక్కును కాపాడుకుందాం. ఓటర్ల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలి: కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుండాల సతీష్

ఓటు హక్కును కాపాడుకుందాం.  ఓటర్ల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలి: కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుండాల సతీష్
July 14, 2026 12:14 PM 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపట

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అమూల్యమైనదని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గుండాల సతీష్ పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై మంగళవారం ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించేందుకేనని పేర్కొన్నారు.

మండలంలోని ప్రతి కుటుంబం తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు లేకపోయినా, కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన వారు ఉన్నా ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఓటర్ల నమోదులో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రక్రియను పూర్తి చేసి ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని గుండాల సతీష్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News