ఓటు హక్కును కాపాడుకుందాం. ఓటర్ల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలి: కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుండాల సతీష్
ఓటు హక్కును కాపాడుకుందాం. ఓటర్ల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలి: కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుండాల సతీష్
Editor Desk
రామన్నపట
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అమూల్యమైనదని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గుండాల సతీష్ పిలుపునిచ్చారు.
రామన్నపేట మండలంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై మంగళవారం ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించేందుకేనని పేర్కొన్నారు.
మండలంలోని ప్రతి కుటుంబం తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు లేకపోయినా, కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన వారు ఉన్నా ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఓటర్ల నమోదులో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రక్రియను పూర్తి చేసి ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని గుండాల సతీష్ కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి