Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నీటి సరఫరా పునరుద్ధరించండి మహా ప్రభో నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 07:12 AM

కస్తూరిబా పాఠశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవం

కస్తూరిబా పాఠశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవం

కస్తూరిబా పాఠశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవం
July 14, 2026 04:43 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థినులకు మాత్రలు వేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

పిల్లల ఆరోగ్యమే దేశానికి శ్రీరామరక్ష

స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) లో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ హాజరై, పాఠశాల విద్యార్థినిలకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను వేశారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యమే దేశానికి శ్రీరామరక్ష అని కొనియాడారు. నులిపురుగులు పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపానికి దారితీసి వారి శారీరక, మానసిక ఎదుగుదలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ ఆల్బెండజోల్ మాత్రలు పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని, తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఈ మాత్రలు వేయించాలని సూచించారు.

పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత ప్రధానమని చైర్‌పర్సన్ పేర్కొన్నారు. భోజనానికి ముందు, తిన్న తర్వాత, అలాగే మలవిసర్జన అనంతరం చేతులను, కాళ్లను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలన్నారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే 90 శాతం మంది పిల్లలు అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు.​ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు మొగుదాల రమేష్ గౌడ్, వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సుమన్ కళ్యాణ్, హెచ్‌ఈఓ సత్యనారాయణ, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ భవాని, స్థానిక ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News