కస్తూరిబా పాఠశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవం
కస్తూరిబా పాఠశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవం
K.RAVI
విద్యార్థినులకు మాత్రలు వేసిన మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
పిల్లల ఆరోగ్యమే దేశానికి శ్రీరామరక్ష
స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) లో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ హాజరై, పాఠశాల విద్యార్థినిలకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను వేశారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యమే దేశానికి శ్రీరామరక్ష అని కొనియాడారు. నులిపురుగులు పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపానికి దారితీసి వారి శారీరక, మానసిక ఎదుగుదలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ ఆల్బెండజోల్ మాత్రలు పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని, తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఈ మాత్రలు వేయించాలని సూచించారు.
పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత ప్రధానమని చైర్పర్సన్ పేర్కొన్నారు. భోజనానికి ముందు, తిన్న తర్వాత, అలాగే మలవిసర్జన అనంతరం చేతులను, కాళ్లను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలన్నారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే 90 శాతం మంది పిల్లలు అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు మొగుదాల రమేష్ గౌడ్, వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సుమన్ కళ్యాణ్, హెచ్ఈఓ సత్యనారాయణ, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ భవాని, స్థానిక ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి