Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నీటి సరఫరా పునరుద్ధరించండి మహా ప్రభో నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 07:11 AM

నీటి సరఫరా పునరుద్ధరించండి మహా ప్రభో

నీటి సరఫరా పునరుద్ధరించండి మహా ప్రభో

నీటి సరఫరా పునరుద్ధరించండి మహా ప్రభో
July 14, 2026 04:43 AM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామం వై జంక్షన్ సమీపంలోని బీసీ కాలనీలో ప్రధాన తాగునీటి పైప్‌లైన్ దెబ్బతినడంతో గత ఐదు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్య కారణంగా బీసీ కాలనీతో పాటు సమీపంలోని మరో రెండు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాగునీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

దెబ్బతిన్న పైప్‌లైన్‌ను వెంటనే మరమ్మతు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News