Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:33 AM

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత కోరిన బీఆర్ఎస్

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత కోరిన బీఆర్ఎస్

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత కోరిన బీఆర్ఎస్
14-07-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల, జూలై 14:

చిట్యాల భువనగిరి ప్రధాన రహదారి విస్తరణ పనులపై ప్రజల్లో నెలకొన్న సందిగ్ధతను నివృత్తి చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. రహదారిని ఎన్ని అడుగుల వెడల్పుతో విస్తరించనున్నారనే అంశంపై అధికార యంత్రాంగం వెంటనే స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

రహదారి విస్తరణకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించకపోవడంతో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయని, దీనివల్ల వ్యాపారులు, భవన యజమానులు, స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని నాయకులు పేర్కొన్నారు. విస్తరణ పనుల పరిధి, భూ సేకరణ అవసరం, ప్రభావిత నిర్మాణాల వివరాలు వంటి అంశాలను బహిర్గతం చేసి అపోహలకు తెరదించాలని కోరారు.ఈ సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి మాట్లాడుతూ, ప్రజలకు ముందస్తు సమాచారం అందించకుండా చేపట్టే చర్యలు ఇబ్బందులకు దారితీసే అవకాశముందని అన్నారు. రహదారి విస్తరణను పారదర్శకంగా అమలు చేస్తూ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగొట్టి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్.కె. షబానా అజీముద్దీన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు జిట్ట బొందయ్య, బొబ్బల శివశంకర్ రెడ్డి, కందాటి రమేష్ రెడ్డి, రుద్రారపు కృష్ణ, ఆగు అశోక్, మారగోని రమేష్, బొలుగురి సైదులు, ఆవుల ఆనంద్, జిట్టా కృష్ణ, ఉప్పలపల్లి నగేష్, జిట్టా శేఖర్, కునూరు శంకర్, చేపూరి శ్రీనివాస్, సుంచు సైదులు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత కోరిన బీఆర్ఎస్

Article Image


చిట్యాల, జూలై 14:

చిట్యాల భువనగిరి ప్రధాన రహదారి విస్తరణ పనులపై ప్రజల్లో నెలకొన్న సందిగ్ధతను నివృత్తి చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. రహదారిని ఎన్ని అడుగుల వెడల్పుతో విస్తరించనున్నారనే అంశంపై అధికార యంత్రాంగం వెంటనే స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

రహదారి విస్తరణకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించకపోవడంతో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయని, దీనివల్ల వ్యాపారులు, భవన యజమానులు, స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని నాయకులు పేర్కొన్నారు. విస్తరణ పనుల పరిధి, భూ సేకరణ అవసరం, ప్రభావిత నిర్మాణాల వివరాలు వంటి అంశాలను బహిర్గతం చేసి అపోహలకు తెరదించాలని కోరారు.ఈ సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి మాట్లాడుతూ, ప్రజలకు ముందస్తు సమాచారం అందించకుండా చేపట్టే చర్యలు ఇబ్బందులకు దారితీసే అవకాశముందని అన్నారు. రహదారి విస్తరణను పారదర్శకంగా అమలు చేస్తూ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగొట్టి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్.కె. షబానా అజీముద్దీన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు జిట్ట బొందయ్య, బొబ్బల శివశంకర్ రెడ్డి, కందాటి రమేష్ రెడ్డి, రుద్రారపు కృష్ణ, ఆగు అశోక్, మారగోని రమేష్, బొలుగురి సైదులు, ఆవుల ఆనంద్, జిట్టా కృష్ణ, ఉప్పలపల్లి నగేష్, జిట్టా శేఖర్, కునూరు శంకర్, చేపూరి శ్రీనివాస్, సుంచు సైదులు, సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News