చిట్యాల, జూలై 14:
చిట్యాల భువనగిరి ప్రధాన రహదారి విస్తరణ పనులపై ప్రజల్లో నెలకొన్న సందిగ్ధతను నివృత్తి చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. రహదారిని ఎన్ని అడుగుల వెడల్పుతో విస్తరించనున్నారనే అంశంపై అధికార యంత్రాంగం వెంటనే స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
రహదారి విస్తరణకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించకపోవడంతో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయని, దీనివల్ల వ్యాపారులు, భవన యజమానులు, స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని నాయకులు పేర్కొన్నారు. విస్తరణ పనుల పరిధి, భూ సేకరణ అవసరం, ప్రభావిత నిర్మాణాల వివరాలు వంటి అంశాలను బహిర్గతం చేసి అపోహలకు తెరదించాలని కోరారు.ఈ సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి మాట్లాడుతూ, ప్రజలకు ముందస్తు సమాచారం అందించకుండా చేపట్టే చర్యలు ఇబ్బందులకు దారితీసే అవకాశముందని అన్నారు. రహదారి విస్తరణను పారదర్శకంగా అమలు చేస్తూ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగొట్టి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్.కె. షబానా అజీముద్దీన్తో పాటు బీఆర్ఎస్ నాయకులు జిట్ట బొందయ్య, బొబ్బల శివశంకర్ రెడ్డి, కందాటి రమేష్ రెడ్డి, రుద్రారపు కృష్ణ, ఆగు అశోక్, మారగోని రమేష్, బొలుగురి సైదులు, ఆవుల ఆనంద్, జిట్టా కృష్ణ, ఉప్పలపల్లి నగేష్, జిట్టా శేఖర్, కునూరు శంకర్, చేపూరి శ్రీనివాస్, సుంచు సైదులు, సాయి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి