Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 05:45 PM

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత కోరిన బీఆర్ఎస్

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత కోరిన బీఆర్ఎస్

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత కోరిన బీఆర్ఎస్
July 14, 2026 03:43 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల, జూలై 14:

చిట్యాల భువనగిరి ప్రధాన రహదారి విస్తరణ పనులపై ప్రజల్లో నెలకొన్న సందిగ్ధతను నివృత్తి చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. రహదారిని ఎన్ని అడుగుల వెడల్పుతో విస్తరించనున్నారనే అంశంపై అధికార యంత్రాంగం వెంటనే స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

రహదారి విస్తరణకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించకపోవడంతో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయని, దీనివల్ల వ్యాపారులు, భవన యజమానులు, స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని నాయకులు పేర్కొన్నారు. విస్తరణ పనుల పరిధి, భూ సేకరణ అవసరం, ప్రభావిత నిర్మాణాల వివరాలు వంటి అంశాలను బహిర్గతం చేసి అపోహలకు తెరదించాలని కోరారు.ఈ సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి మాట్లాడుతూ, ప్రజలకు ముందస్తు సమాచారం అందించకుండా చేపట్టే చర్యలు ఇబ్బందులకు దారితీసే అవకాశముందని అన్నారు. రహదారి విస్తరణను పారదర్శకంగా అమలు చేస్తూ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగొట్టి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్.కె. షబానా అజీముద్దీన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు జిట్ట బొందయ్య, బొబ్బల శివశంకర్ రెడ్డి, కందాటి రమేష్ రెడ్డి, రుద్రారపు కృష్ణ, ఆగు అశోక్, మారగోని రమేష్, బొలుగురి సైదులు, ఆవుల ఆనంద్, జిట్టా కృష్ణ, ఉప్పలపల్లి నగేష్, జిట్టా శేఖర్, కునూరు శంకర్, చేపూరి శ్రీనివాస్, సుంచు సైదులు, సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News