రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన
రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన
Biksham
సూర్యాపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ ఎస్ఐ యాడవెందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందన్నారు. ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, డ్రంక్ అండ్ డ్రైవ్కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ను తప్పనిసరిగా పాటించాలని, సిగ్నల్ జంపింగ్ చేయవద్దని సూచించారు.
అలాగే ఆటోలలో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు వాహనాలను సీజ్ చేసే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి