PRINT TIME: July 14, 2026 07:35 PM
మహిళల ఇబ్బందులకు ముగింపు పలకాలి: కలెక్టర్ను కోరిన అస్మా
మహిళల ఇబ్బందులకు ముగింపు పలకాలి: కలెక్టర్ను కోరిన అస్మా
July 14, 2026 05:49 PM
22 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ను కలిసి జహీరాబాద్ పట్టణంతో పాటు జిల్లాలోని ప్రజా మరుగుదొడ్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జహీరాబాద్లోని అనేక శౌచాలయాలు ఆక్రమణలకు గురై ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు నిర్వహణ కూడా సరిగా లేదని, ప్రతిరోజూ వేలాది మంది పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ముఖ్యంగా మహిళలకు తగిన మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫోటోలతో సహా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త మరుగుదొడ్లు నిర్మించి, ప్రస్తుతం ఉన్న వాటిని పరిశుభ్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి