సరస్వతీ పుత్రికకు రూ.10 వేల ఆర్థిక సాయం
సరస్వతీ పుత్రికకు రూ.10 వేల ఆర్థిక సాయం
Biksham
అక్షర ఫౌండేషన్ సేవలు అభినందనీయం : రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు అడ్డంకిగా మారకూడదని, నిరుపేద విద్యార్థులకు చేయూతనందించడం సమాజ బాధ్యత అని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్లో సోమవారం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో, యాస శృతి సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నూతనకల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సప్పిడి నందినికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువులో రాణిస్తూ అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న నిరుపేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించడం హర్షణీయమన్నారు. విద్యార్థులు ఇలాంటి సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సమాజంలోని దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, క్రీడలు, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష సేవలందిస్తూ అక్షర ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ చైర్మన్ యాస రామ్కుమార్ రెడ్డి, అధ్యక్షుడు ఉప్పు నాగయ్య, కార్యదర్శి రుద్రంగి కాళిదాసు, సుభాష్ చంద్రబోస్, బత్తిని ఉపేందర్, కాసర్ల సైదులు, గడ్డం వీరబాబు, ధరావత్ వీరాసింగ్, గంగాధర్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి