ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. మాడ్గిలో రెండు బోర్ల ప్రారంభం
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. మాడ్గిలో రెండు బోర్ల ప్రారంభం
Krishna
జహీరాబాద్ నియోజకవర్గంలో మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు తాగునీటి బోర్లను గురువారం రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ బోర్లను బోరు మోటార్ స్టార్టర్ను ఆన్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ముబీన్, గ్రామ సర్పంచ్ హర్షద్ పటేల్, జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇమామ్ పటేల్, హర్షవర్ధన్ రెడ్డి, అశ్విన్ పాటిల్, మోహీన్, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి