చదువుతో పాటు న్యాయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య
చదువుతో పాటు న్యాయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య
Editor Desk
రామన్నపేట,
విద్యార్థులు విద్యలో రాణించడమే కాకుండా చట్టాలపై అవగాహన పెంచుకుని సమాజానికి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య అన్నారు. రామన్నపేట మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రతి విద్యార్థి విద్యాహక్కు చట్టం, బాల కార్మిక నిర్మూలన చట్టం, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, కార్మిక చట్టాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమాజంలో జరిగే చట్టవిరుద్ధ ఘటనలను చూసి మౌనంగా ఉండకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై పూర్తి దృష్టి సారిస్తేనే ఉన్నత లక్ష్యాలను సాధించగలరని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులను భాగస్వాములను చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా స్థానిక పోలీస్ స్టేషన్ లేదా మండల న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించి న్యాయం పొందాలని సూచించారు.
ఈ సందర్భంగా ఏజీపీ సుక్క శ్రావణ్ మాట్లాడుతూ, విద్యార్థులు చట్టాలపై అవగాహనతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన ఉంటేనే నేరాలు, దురాచారాలను అరికట్టడంలో యువత కీలక పాత్ర పోషించగలరని అన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి