ఆందోల్ మైసమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 15.13 లక్షలు
ఆందోల్ మైసమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 15.13 లక్షలు
K.RAVI
144 రోజులకు గాను భక్తుల కానుకలు
దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పర్యవేక్షణలో లెక్కింపు
చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థాన హుండీ కానుకలను శుక్రవారం అధికారులు లెక్కించారు. నల్గొండ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ (ఏసీ) పర్యవేక్షణ అధికారి కె. భాస్కర్ ఆధ్వర్యంలో దేవస్థాన ప్రాంగణంలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు చేపట్టారు. గడిచిన 144 రోజులకు గాను హుండీ ద్వారా ఆలయానికి రూ. 15,13,204 (పదిహేను లక్షల పదమూడు వేల రెండు వందల నాలుగు రూపాయలు) ఆదాయం సమకూరినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో నోట్ల రూపంలో రూ. 14,26,800 రాగా, నాణేల రూపంలో రూ. 86,404 వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డి, ధర్మకర్తలు జొన్నగంటి దాసు, డి. రాజేష్, డి. రాజీవ్, ఇ. బాబు, ఎస్. ఆనంద్ రెడ్డి, వి. శివ చారి, బి. నరసింహ, ఎం. మహేందర్ రెడ్డి, బి. యువరాజు, పి. రమేష్, బి. శ్రీకాంత్, సిహెచ్. సబిత, మీసాల నరసింహ, మల్కాపురం ఉపసర్పంచ్, గ్రామస్తులు వేలువర్తి యాదగిరి, ఈడుదుల మస్తాన్ బాబు, సిహెచ్. జంగయ్య, జంగారెడ్డి, శ్రీవారి సేవ సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి