కేకే కమిటీకి రామన్నపేట ఉద్యమకారుల వినతి. ప్రతి అర్హ ఉద్యమకారుడికి గుర్తింపు, సంక్షేమం కల్పించాలని బొడ్డుపల్లి లింగయ్య విజ్ఞప్తి.
కేకే కమిటీకి రామన్నపేట ఉద్యమకారుల వినతి. ప్రతి అర్హ ఉద్యమకారుడికి గుర్తింపు, సంక్షేమం కల్పించాలని బొడ్డుపల్లి లింగయ్య విజ్ఞప్తి.
Editor Desk
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం న్యాయం చేసి, తగిన గుర్తింపు కల్పించాలని రామన్నపేట మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య కోరారు.
హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ సభ్యులకు వినతిపత్రం అందజేశారు. రామన్నపేట మండలంలోని గ్రామాల వారీగా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని రాష్ట్ర సాధన కోసం సేవలందించిన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి, అర్హులందరికీ ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారుల్లో ఇప్పటికీ చాలామందికి ప్రభుత్వ గుర్తింపు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తిని గౌరవిస్తూ, వారి సేవలకు తగిన గుర్తింపు, సంక్షేమ ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి