Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్న కేంద్ర ఆర్థిక విధానాలు దొడ్డి దారిన మూడు నల్ల చట్టాలను మళ్లీ తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 17, 2026 07:44 PM

కేకే కమిటీకి రామన్నపేట ఉద్యమకారుల వినతి. ప్రతి అర్హ ఉద్యమకారుడికి గుర్తింపు, సంక్షేమం కల్పించాలని బొడ్డుపల్లి లింగయ్య విజ్ఞప్తి.

కేకే కమిటీకి రామన్నపేట ఉద్యమకారుల వినతి. ప్రతి అర్హ ఉద్యమకారుడికి గుర్తింపు, సంక్షేమం కల్పించాలని బొడ్డుపల్లి లింగయ్య విజ్ఞప్తి.

కేకే కమిటీకి రామన్నపేట ఉద్యమకారుల వినతి.  ప్రతి అర్హ ఉద్యమకారుడికి గుర్తింపు, సంక్షేమం కల్పించాలని బొడ్డుపల్లి లింగయ్య విజ్ఞప్తి.
July 17, 2026 06:31 PM 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం న్యాయం చేసి, తగిన గుర్తింపు కల్పించాలని రామన్నపేట మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య కోరారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ సభ్యులకు వినతిపత్రం అందజేశారు. రామన్నపేట మండలంలోని గ్రామాల వారీగా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని రాష్ట్ర సాధన కోసం సేవలందించిన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి, అర్హులందరికీ ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని కోరారు.

తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారుల్లో ఇప్పటికీ చాలామందికి ప్రభుత్వ గుర్తింపు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తిని గౌరవిస్తూ, వారి సేవలకు తగిన గుర్తింపు, సంక్షేమ ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News