Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండకు వెంటనే పూర్తి స్థాయి మున్సిపల్ కమిషనర్‌ను నియమించాలి: CM రేవంత్ రెడ్డికి BJP OBC మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ బహిరంగ లేఖ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 17, 2026 08:28 PM

15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి

15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి

15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి
July 17, 2026 07:05 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్రామ పంచాయతీల 15వ ఆర్థిక సంఘం నిధులను పెండింగ్ విద్యుత్ బిల్లులకు మళ్లిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల సర్పంచులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయతీల విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్నారు. కేంద్ర నిధులను మళ్లించడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక స్వపరిపాలన బలోపేతం కోసం ఈ నిధులను గ్రామాల ప్రగతికే వినియోగించేలా చూడాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సర్పంచులు సుర్వి మల్లేష్ గౌడ్, జి. నిరంజన్ గౌడ్, నందగిరి వెంకటేష్ గౌడ్, స్వప్న, మహేంద్ర మణి, భారతమ్మ తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News