గ్రామ పంచాయతీల 15వ ఆర్థిక సంఘం నిధులను పెండింగ్ విద్యుత్ బిల్లులకు మళ్లిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల సర్పంచులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయతీల విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్నారు. కేంద్ర నిధులను మళ్లించడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక స్వపరిపాలన బలోపేతం కోసం ఈ నిధులను గ్రామాల ప్రగతికే వినియోగించేలా చూడాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సర్పంచులు సుర్వి మల్లేష్ గౌడ్, జి. నిరంజన్ గౌడ్, నందగిరి వెంకటేష్ గౌడ్, స్వప్న, మహేంద్ర మణి, భారతమ్మ తదితరులు ఉన్నారు.
PRINT TIME: September 08, 2026 07:45 AM
15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి
15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి
17-07-2026
28 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
గ్రామ పంచాయతీల 15వ ఆర్థిక సంఘం నిధులను పెండింగ్ విద్యుత్ బిల్లులకు మళ్లిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల సర్పంచులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయతీల విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్నారు. కేంద్ర నిధులను మళ్లించడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక స్వపరిపాలన బలోపేతం కోసం ఈ నిధులను గ్రామాల ప్రగతికే వినియోగించేలా చూడాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సర్పంచులు సుర్వి మల్లేష్ గౌడ్, జి. నిరంజన్ గౌడ్, నందగిరి వెంకటేష్ గౌడ్, స్వప్న, మహేంద్ర మణి, భారతమ్మ తదితరులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి