ఏపీకి భారీ పెట్టుబడులు – వేలాది ఉద్యోగాలు రానున్నాయి: గడ్డా ఫక్రుద్దీన్
ఏపీకి భారీ పెట్టుబడులు – వేలాది ఉద్యోగాలు రానున్నాయి: గడ్డా ఫక్రుద్దీన్
Editor Desk
ఆదోని, : ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే మరిన్ని జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయని, దీంతో రాష్ట్ర యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని టీడీపీ ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ తెలిపారు.
శుక్రవారం ఆదోనిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా మారిందన్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో మంత్రి లోకేష్ సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో కేంద్రం–రాష్ట్రం సమన్వయంతో పనిచేస్తున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని, పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. దీనికి దక్షిణ కొరియా ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని చదువుకున్న యువతకు ఉపాధి కల్పించేందుకు కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థలు త్వరలోనే రానున్నాయని గడ్డా ఫక్రుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు.
అదేవిధంగా కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా భారత్ సిమెంట్ లిమిటెడ్ లైన్–2 విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారని తెలిపారు. రూ.3,100 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 6.1 మిలియన్ టన్నుల క్లింకర్, 9.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యానికి పెరుగుతుందని చెప్పారు.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 1,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గడ్డా ఫక్రుద్దీన్ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి