కంది సెంట్రల్ జైలులో భద్రతపై ఎస్పీ ప్రత్యేక సమీక్ష.. కట్టుదిట్టమైన నిఘాకు కీలక ఆదేశాలు
కంది సెంట్రల్ జైలులో భద్రతపై ఎస్పీ ప్రత్యేక సమీక్ష.. కట్టుదిట్టమైన నిఘాకు కీలక ఆదేశాలు
Krishna
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలును జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సందర్శించి జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్తో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. జైలు ఆవరణ, ప్రధాన ప్రవేశ ద్వారాలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధులను పరిశీలించిన ఆయన, ఖైదీల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. నిషేధిత వస్తువులు జైలులోకి రాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని, సందర్శకుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షిస్తూ, జైలు గోడలు, ప్రవేశ ద్వారాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని, సిబ్బందికి తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించి అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. జైలు భద్రత విషయంలో పోలీసు శాఖ, జైలు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్తో పాటు జైలు అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి