శ్రీ ఆర్.కె ఆసుపత్రిలో 4.5 కిలోల భారీ అండాశయ కణితి తొలగింపు
శ్రీ ఆర్.కె ఆసుపత్రిలో 4.5 కిలోల భారీ అండాశయ కణితి తొలగింపు
Sthanikam District Staff Reporter
- ఆర్.కె.హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ చావా రాజ్కుమార్
భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్లో 4.5 కిలోల బరువున్న భారీ అండాశయ కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు.నాలుగు గంటలపాటు సాగిన క్లిష్ట శస్త్రచికిత్సను ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ చావా రాజ్కుమార్,సీనియర్ వైద్య నిపుణుడు డాక్టర్ వి.రాజ్కుమార్,అనస్థీషియా నిపుణుడు డాక్టర్ బి.నరేష్,జనరల్ సర్జన్ ఆధ్వర్యంలోని వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది.వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం,భువనగిరికి చెందిన ఓ మహిళ గత నెల రోజులుగా పొత్తికడుపు దిగువ భాగంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. తొలుత స్థానికంగా చికిత్స పొందినా సమస్య తగ్గకపోవడంతో స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా 22×18 సెంటీమీటర్ల పరిమాణంలో అండాశయ కణితి ఉన్నట్లు నిర్ధారణ అయింది.రోగికి ఇప్పటికే బీపీ,మధుమేహం,ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అయితే రోగి స్థానికంగానే చికిత్స పొందాలని నిర్ణయించుకుని శ్రీ ఆర్కే హాస్పిటల్లో డాక్టర్ చావా రాజ్కుమార్ను సంప్రదించారు. అనంతరం సీనియర్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో నాలుగు గంటలపాటు సాగిన శస్త్రచికిత్స ద్వారా 4.5 కిలోల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని,పూర్తిగా కోలుకున్న అనంతరం నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని శ్రీ ఆర్కే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చావా రాజ్కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భువనగిరి పట్టణంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించడమే తమ లక్ష్యమన్నారు.సి-ఆర్మ్, లాపరోస్కోపిక్ సర్జరీతో పాటు పలు ఆధునిక వైద్య సదుపాయాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి