ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ
ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ
K.RAVI
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సుమారు రూ.10,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. శనివారం చౌటుప్పల్లోని శ్రీ చైతన్య పారామెడికల్ కళాశాలలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని, విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఉన్నత చదువులకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందని, బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బకాయిల సాధన కోసం ఎస్ఎఫ్ఐ చేసే పోరాటాలకు కళాశాల యాజమాన్యాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ
మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, అరవింద్, మల్లేష్, పలు కళాశాలల ప్రిన్సిపల్స్ శేఖర్ రెడ్డి, శిలువేరు శ్రీనివాస్, కట్టెల లింగస్వామి, మహేందర్ రెడ్డి, జంగయ్య, ఆంజనేయులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి