పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలి
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలి
K.RAVI
'జాతీయ జల మిషన్' అవగాహన సదస్సులో మున్సిపల్ చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
భూగర్భ జలాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, రాబోయే రోజుల్లో నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో 'జాతీయ జల మిషన్' కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని అన్నా మెమోరియల్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ చిన్నప్ప రెడ్డి విద్యార్థులు, సిబ్బందితో 'జల ప్రతిజ్ఞ' చేయించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండి ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలను తప్పనిసరిగా నిర్మించుకోవాలన్నారు. నీటి సంరక్షణలో యువత, విద్యార్థులు అగ్రభాగంలో నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మన్మధ కుమార్, కౌన్సిలర్లు బుడ్డ సురేష్, చింతల ఉమామహేశ్వరి, మున్సిపల్ అధికారులు హనుమాన్ ప్రసాద్, రేణు కుమార్, వార్డు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి