PRINT TIME: July 18, 2026 09:51 PM
బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
July 18, 2026 08:04 PM
95 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బస్సులో వెళ్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని కృష్ణా జిల్లా నిడమనూరుకు చెందిన పటాన్ ఖాదర్బాషా (41) మ్యారేజ్ బ్యూరోలో పని చేస్తున్నాడు. ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వచ్చి, తిరిగి శుక్రవారం రాత్రి ప్రైవేట్ బస్సులో నిడమనూరుకు బయలుదేరాడు. శనివారం తెల్లవారుజామున 1:40 గంటల సమయంలో బస్సు లక్కారం వద్దకు రాగానే ఖాదర్బాషాకు ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చేసరికే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య పఠాన్ మహిరుణ్ణిశ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి