Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రారంభానికి సిద్ధమైన మర్రిగూడ ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రారంభించాలి: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాస్తారోకో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 18, 2026 09:51 PM

బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
July 18, 2026 08:04 PM 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి బస్సులో వెళ్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని కృష్ణా జిల్లా నిడమనూరుకు చెందిన పటాన్ ఖాదర్బాషా (41) మ్యారేజ్ బ్యూరోలో పని చేస్తున్నాడు. ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వచ్చి, తిరిగి శుక్రవారం రాత్రి ప్రైవేట్ బస్సులో నిడమనూరుకు బయలుదేరాడు. శనివారం తెల్లవారుజామున 1:40 గంటల సమయంలో బస్సు లక్కారం వద్దకు రాగానే ఖాదర్బాషాకు ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చేసరికే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య పఠాన్ మహిరుణ్ణిశ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News