Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో కోతుల బెడదకు చెక్! ​ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 18, 2026 08:31 PM

వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి: బీఆర్ఎస్ రైతుల నిరసన

వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి: బీఆర్ఎస్ రైతుల నిరసన

వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి:  బీఆర్ఎస్ రైతుల నిరసన
July 18, 2026 06:28 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

వ్యవసాయానికి ఎలాంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైతులు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య (మాజీ ఎంపీపీ) మాట్లాడుతూ, గత వారం రోజులుగా కొనసాగుతున్న విద్యుత్ కోతల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.విద్యుత్ అంతరాయాల కారణంగా మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండటంతో వాటి మరమ్మతుల కోసం రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, స్వల్పంగా లభిస్తున్న బోరు నీటితో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో విద్యుత్ కోతలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే విద్యుత్ కోతలను ఎత్తివేసి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత 30 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా మోసపూరిత పాలన సాగిస్తోందని ఆరోపించారు.రైతాంగానికి న్యాయం చేయకపోతే ప్రజలు తగిన సమయంలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు దొంగరి శ్రీను, గుడిపాటి వీరయ్య, మట్టిపెల్లి వెంకట్, గునిగంటి యాదగిరి, గౌడిచర్ల సత్యనారాయణ, గడ్డం సోమేశ్, పూర్ణ నాయక్, తడకమళ్ల రవికుమార్, సర్పంచ్‌లు మనోజ్, మాతంగి వెంకటమ్మ, కరుణాకర్, మాజీ సర్పంచ్ వీరోజీ, యాకూ నాయక్, కళ్యాణ్, గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న, నాగమల్లు, శ్రీకాంత్, సాయికిరణ్, మహేందర్, భాస్కర్, రమేష్, వెంకన్న, వీరన్న, సురేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News