వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి: బీఆర్ఎస్ రైతుల నిరసన
వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి: బీఆర్ఎస్ రైతుల నిరసన
Bandi Kiran Kumar
వ్యవసాయానికి ఎలాంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైతులు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య (మాజీ ఎంపీపీ) మాట్లాడుతూ, గత వారం రోజులుగా కొనసాగుతున్న విద్యుత్ కోతల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.విద్యుత్ అంతరాయాల కారణంగా మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండటంతో వాటి మరమ్మతుల కోసం రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, స్వల్పంగా లభిస్తున్న బోరు నీటితో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో విద్యుత్ కోతలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే విద్యుత్ కోతలను ఎత్తివేసి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత 30 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా మోసపూరిత పాలన సాగిస్తోందని ఆరోపించారు.రైతాంగానికి న్యాయం చేయకపోతే ప్రజలు తగిన సమయంలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు దొంగరి శ్రీను, గుడిపాటి వీరయ్య, మట్టిపెల్లి వెంకట్, గునిగంటి యాదగిరి, గౌడిచర్ల సత్యనారాయణ, గడ్డం సోమేశ్, పూర్ణ నాయక్, తడకమళ్ల రవికుమార్, సర్పంచ్లు మనోజ్, మాతంగి వెంకటమ్మ, కరుణాకర్, మాజీ సర్పంచ్ వీరోజీ, యాకూ నాయక్, కళ్యాణ్, గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న, నాగమల్లు, శ్రీకాంత్, సాయికిరణ్, మహేందర్, భాస్కర్, రమేష్, వెంకన్న, వీరన్న, సురేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి