రామన్నపేట, మండలంలోని సిరిపురం గ్రామంలో IICT సంస్థ నిర్మించిన ఆధునిక మురుగునీటి శుద్ధి (సీవరేజ్ ట్రీట్మెంట్) ప్లాంట్ను సోమవారం (జూలై 20) ఉదయం 8.30 గంటలకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్ తెలిపారు.
గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు మురుగునీటి నిర్వహణకు ఈ ప్లాంట్ ఉపయోగపడనుందని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిరిపురం గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పున్న జగన్ విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి