పోచమ్మ ఆలయంలో చోరీ.. 48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనమే నేరానికి కారణం.. బంగారు పుస్తెలు, వెండి వస్తువులు, నగదు స్వాధీనం
పోచమ్మ ఆలయంలో చోరీ.. 48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనమే నేరానికి కారణం.. బంగారు పుస్తెలు, వెండి వస్తువులు, నగదు స్వాధీనం
Editor Desk
చైతన్యపురి, జూలై 19: సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయంలో ఈ నెల 16న జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బూర్ల అనిల్ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి అమ్మవారి బంగారు పుస్తెలు, వెండి వస్తువులు, హుండీలోని నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుడు ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై తీవ్ర అప్పుల్లో కూరుకుపోవడంతో డబ్బు కోసం దేవాలయాన్ని లక్ష్యంగా ఎంచుకున్నట్లు వెల్లడైంది. అర్ధరాత్రి సమయంలో ఆలయం తాళాలు పగులగొట్టి, సీసీటీవీ వైర్లు కత్తిరించిన అనంతరం అమ్మవారి బంగారు పుస్తెలు, హుండీని అపహరించాడు. తర్వాత హుండీని పగులగొట్టి అందులోని నగదును తీసుకున్నాడు.
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, శాస్త్రీయ సాక్ష్యాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్కు తరలించింది.
కేసును వేగంగా ఛేదించిన క్రైమ్ ఎస్ఐ కె. మహేందర్తో పాటు దర్యాప్తు బృందాన్ని సరూర్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సీహెచ్. శేఖర్, ఎన్హెచ్బీ ఆర్ఐ ఎన్. శ్రీశైలం అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి