హలో ఉద్యమకారుడా.. చలో హైదరాబాద్ కేకే కమిటీకి వినతులు సమర్పించండి. ఉద్యమకారులందరూ పాల్గొని సూచనలు ఇవ్వాలి: జోగు అంజన్న
హలో ఉద్యమకారుడా.. చలో హైదరాబాద్ కేకే కమిటీకి వినతులు సమర్పించండి. ఉద్యమకారులందరూ పాల్గొని సూచనలు ఇవ్వాలి: జోగు అంజన్న
Editor Desk
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసినవారు, లాఠీ దెబ్బలు, భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లను ఎదుర్కొన్నవారు, కేసులు ఎదుర్కొని జైలు జీవితం గడిపినవారు, ఆస్తులు కోల్పోయి నేటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఉద్యమకారులకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పిలుపునిచ్చారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల సమస్యలు మరుగునపడిన నేపథ్యంలో గత తొమ్మిదేళ్లుగా ఉద్యమకారుల హక్కుల కోసం ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నిరంతర పోరాటం సాగిందన్నారు. ఆ పోరాట ఫలితంగానే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారుల అంశాన్ని చేర్చడంతో పాటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం కేకే కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.
తొలి దశ, మలి దశ ఉద్యమకారులను గుర్తించేందుకు కేకే కమిటీ ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వేదిక వద్ద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోందన్నారు.
ఈ నేపథ్యంలో జూలై 20న అన్ని ఉద్యమకారులు, ఉద్యమ సంఘాల నాయకులు, నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో హాజరై తమ సూచనలు, సలహాలు, వినతిపత్రాలను కేకే కమిటీకి సమర్పించాలని కోరారు. ప్రతి నిజమైన ఉద్యమకారుడికి న్యాయం జరిగే వరకు ఉద్యమకారుల ఫోరం అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తుందని జోగు అంజన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి