శ్రద్ధగా వింటే విజయం మీదే
శ్రద్ధగా వింటే విజయం మీదే
Harish K
కోదాడలోని కె.ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలను సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) బి. సులోచనా రాణి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలలోని రికార్డ్స్ పరిశీలించిన అనంతరం అధ్యాపకుల బోధనాశైలిని, విద్యార్థుల క్రమశిక్షణ పట్ల, సమయపాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో డి.ఐ.ఈ.ఓ మాట్లాడుతూ... క్రమశిక్షణతో తరగతి గదిలో పాఠాలను శ్రద్ధగా విన్నట్లయితే విజయం మీ దరి చేరుతుందని అన్నారు. కళాశాలలోని అన్ని వసతులను విద్యార్థులు ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలు సాధించాలని, మంచి మార్కులతో పై తరగతులు చదివి, జీవితంలో స్థిరపడి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె అన్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి హాస్టల్లో ఉచిత వసతి ఉన్నదని, గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం త్వరలో ప్రారంభం కానున్నదని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి