Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రద్ధగా వింటే విజయం మీదే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 19, 2026 06:17 AM

శ్రద్ధగా వింటే విజయం మీదే

శ్రద్ధగా వింటే విజయం మీదే

శ్రద్ధగా వింటే విజయం మీదే
July 19, 2026 01:08 AM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడలోని కె.ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలను సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) బి. సులోచనా రాణి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలలోని రికార్డ్స్ పరిశీలించిన అనంతరం అధ్యాపకుల బోధనాశైలిని, విద్యార్థుల క్రమశిక్షణ పట్ల, సమయపాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో డి.ఐ.ఈ.ఓ మాట్లాడుతూ... క్రమశిక్షణతో తరగతి గదిలో పాఠాలను శ్రద్ధగా విన్నట్లయితే విజయం మీ దరి చేరుతుందని అన్నారు. కళాశాలలోని అన్ని వసతులను విద్యార్థులు ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలు సాధించాలని, మంచి మార్కులతో పై తరగతులు చదివి, జీవితంలో స్థిరపడి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె అన్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి హాస్టల్లో ఉచిత వసతి ఉన్నదని, గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం త్వరలో ప్రారంభం కానున్నదని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News