Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉత్సాహంగా అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 20, 2026 09:09 AM

కొత్త సీఐ రాకతో నేరగాళ్లలో కలవరం..!బాధ్యతలు చేపట్టగానే యాక్షన్.. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలే: సీఐ ఆదిరెడ్డి.

కొత్త సీఐ రాకతో నేరగాళ్లలో కలవరం..!బాధ్యతలు చేపట్టగానే యాక్షన్.. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలే: సీఐ ఆదిరెడ్డి.

కొత్త సీఐ రాకతో నేరగాళ్లలో కలవరం..!బాధ్యతలు చేపట్టగానే యాక్షన్.. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలే: సీఐ ఆదిరెడ్డి.
July 19, 2026 09:25 AM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టూ టౌన్‌లో రౌడీషీటర్లు, గంజాయి ముఠాలపై ఉక్కుపాదం.

నల్లగొండ, టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదిరెడ్డి తొలి రోజే యాక్షన్ మోడ్‌లోకి వెళ్లారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, రౌడీషీటర్లు, గంజాయి ముఠాలు, సంఘవిద్రోహ శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

గతంలో టూ టౌన్ సీఐగా పనిచేసిన ఎస్. రాఘవరావు హాలియాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఆదిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో నల్లగొండ జిల్లాలోనే సేవలందించిన ఆయన పలు కీలక కేసులను ఛేదించి సమర్థ అధికారిగా గుర్తింపు పొందారు.

బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలీస్ స్టేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆదిరెడ్డి.. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, సమర్థ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. టూ టౌన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తామని తెలిపారు.

"చట్టం ముందు ఎవరూ అతీతులు కాదు"

"చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. రౌడీషీటర్లు, గంజాయి వ్యాపారులు, సంఘవిద్రోహ శక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటాం. ప్రజల సహకారంతో నేరరహిత టూ టౌన్‌ను నిర్మిస్తాం" అని సీఐ ఆదిరెడ్డి స్పష్టం చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, నేరాల నియంత్రణలో రాజీపడేది లేదన్న సీఐ వ్యాఖ్యలతో టూ టౌన్‌లో అసాంఘిక శక్తుల్లో కలవరం నెలకొంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News