కొత్త సీఐ రాకతో నేరగాళ్లలో కలవరం..!బాధ్యతలు చేపట్టగానే యాక్షన్.. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలే: సీఐ ఆదిరెడ్డి.
కొత్త సీఐ రాకతో నేరగాళ్లలో కలవరం..!బాధ్యతలు చేపట్టగానే యాక్షన్.. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలే: సీఐ ఆదిరెడ్డి.
Editor Desk
టూ టౌన్లో రౌడీషీటర్లు, గంజాయి ముఠాలపై ఉక్కుపాదం.
నల్లగొండ, టూ టౌన్ పోలీస్ స్టేషన్కు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆదిరెడ్డి తొలి రోజే యాక్షన్ మోడ్లోకి వెళ్లారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, రౌడీషీటర్లు, గంజాయి ముఠాలు, సంఘవిద్రోహ శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
గతంలో టూ టౌన్ సీఐగా పనిచేసిన ఎస్. రాఘవరావు హాలియాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఆదిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో నల్లగొండ జిల్లాలోనే సేవలందించిన ఆయన పలు కీలక కేసులను ఛేదించి సమర్థ అధికారిగా గుర్తింపు పొందారు.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలీస్ స్టేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆదిరెడ్డి.. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, సమర్థ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. టూ టౌన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తామని తెలిపారు.
"చట్టం ముందు ఎవరూ అతీతులు కాదు"
"చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. రౌడీషీటర్లు, గంజాయి వ్యాపారులు, సంఘవిద్రోహ శక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటాం. ప్రజల సహకారంతో నేరరహిత టూ టౌన్ను నిర్మిస్తాం" అని సీఐ ఆదిరెడ్డి స్పష్టం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, నేరాల నియంత్రణలో రాజీపడేది లేదన్న సీఐ వ్యాఖ్యలతో టూ టౌన్లో అసాంఘిక శక్తుల్లో కలవరం నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి