శస్త్రచికిత్స వికటించి యువతి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమంటూ బంధువుల ఆందోళన.
శస్త్రచికిత్స వికటించి యువతి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమంటూ బంధువుల ఆందోళన.
Editor Desk
హయత్నగర్,
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనంతరం ఓ మహిళ మృతి చెందిన ఘటన హయత్నగర్లోని నీలాద్రి ఆస్పత్రిలో కలకలం రేపింది. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గోనెతండాకు చెందిన మంజుల (23) కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, శనివారం ఆపరేషన్ అనంతరం తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు మంజుల వైద్యులకు తెలిపినా, యాంటీబయాటిక్ మందులు మాత్రమే ఇచ్చారని, ఆ మందులు తనకు పడవని చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎల్బీ నగర్లోని కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యమే మంజుల మృతికి కారణమని ఆరోపిస్తూ బంధువులు నీలాద్రి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి