ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారుల నియామకానికి చర్యలు
ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారుల నియామకానికి చర్యలు
Editor Desk
ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజించినప్పటికీ అన్ని శాఖలకు ప్రత్యేక అధికారులను నియమించకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదోని రెండో మండలానికి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు, అన్ని శాఖల అధికారుల నియామకం, నూతన కార్యాలయాల ఏర్పాటు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం రెండు మండలాలకు ఒకే తహసీల్దారు, పలుశాఖలకు ఒక్కో అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తుండటంతో ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
రైతులు, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పార్థసారధి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. త్వరలోనే అధికారుల నియామకాలు, కార్యాలయాల ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి