Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:51 AM

ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారుల నియామకానికి చర్యలు

ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారుల నియామకానికి చర్యలు

ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారుల నియామకానికి చర్యలు
03-06-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజించినప్పటికీ అన్ని శాఖలకు ప్రత్యేక అధికారులను నియమించకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో ఆదోని రెండో మండలానికి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు, అన్ని శాఖల అధికారుల నియామకం, నూతన కార్యాలయాల ఏర్పాటు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం రెండు మండలాలకు ఒకే తహసీల్దారు, పలుశాఖలకు ఒక్కో అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండటంతో ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.


రైతులు, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పార్థసారధి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. త్వరలోనే అధికారుల నియామకాలు, కార్యాలయాల ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారుల నియామకానికి చర్యలు

Article Image

ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజించినప్పటికీ అన్ని శాఖలకు ప్రత్యేక అధికారులను నియమించకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో ఆదోని రెండో మండలానికి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు, అన్ని శాఖల అధికారుల నియామకం, నూతన కార్యాలయాల ఏర్పాటు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం రెండు మండలాలకు ఒకే తహసీల్దారు, పలుశాఖలకు ఒక్కో అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండటంతో ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.


రైతులు, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పార్థసారధి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. త్వరలోనే అధికారుల నియామకాలు, కార్యాలయాల ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News