Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:58 PM

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య – ముగ్గురు నిందితులు అరెస్ట్

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య – ముగ్గురు నిందితులు అరెస్ట్

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య – ముగ్గురు నిందితులు అరెస్ట్
May 25, 2026 08:36 PM 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలో సంచలనం సృష్టించిన ముత్యం రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గంగాపూర్ గ్రామానికి చెందిన బోర్ మోటార్ మెకానిక్ శంబనోల్లా ముత్యం రెడ్డి ఈ నెల 16వ తేదీ నుంచి కనిపించకుండా పోవడంతో, అతని భార్య శంబనోల్లా కల్పన 18వ తేదీన నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో కల్పన ప్రవర్తనపై అనుమానం రావడంతో లోతుగా ఆరా తీయగా, ఆమెకు మానూర్ మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన గైని పండరితో అక్రమ సంబంధం ఉన్నట్లు బయటపడింది.పోలీసులు గైని పండరిని అదుపులోకి తీసుకుని విచారించగా, కల్పన, పండరి మరియు అతని అన్న గైని విట్టల్ కలిసి ముత్యం రెడ్డిని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. గత కొంతకాలంగా కల్పన, పండరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతుండగా, ఈ విషయం తెలుసుకున్న ముత్యం రెడ్డి భార్యను పలుమార్లు మందలించేవాడు. దీంతో తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన కల్పన, ప్రియుడు పండరితో కలిసి హత్యకు పథకం రచించింది.ఈ నెల 16న ముత్యం రెడ్డిని బోర్ మోటార్ స్టార్టర్ రిపేర్ పని ఉందని నమ్మించి పండరి తన పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ ముందుగానే సిద్ధంగా ఉన్న గైని విట్టల్‌తో కలిసి తాడుతో మెడ బిగించి హత్య చేశారు. అనంతరం ముందే జేసీబీతో తవ్విన గుంతలో మృతదేహాన్ని పడేసి మట్టితో పూడ్చిపెట్టారు. కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు నారాయణఖేడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎస్సై శ్రీశైలం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News