మానవత్వం చాటిన ఆరెగూడెం సర్పంచ్.. బాలరాజ్ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
మానవత్వం చాటిన ఆరెగూడెం సర్పంచ్.. బాలరాజ్ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
Komidala Mahender reddy
ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన శ్యాంసుందర్ అధిక వడ్డీ అప్పుల భారంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూ మృతి చెందిన వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) బాలరాజ్ కుటుంబానికి ఆరెగూడెం సర్పంచ్ శ్యాంసుందర్ మానవత్వాన్ని చాటుకున్నారు. కుటుంబం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకుని, వారి అవసరాల కోసం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.
బాలరాజ్ మరణంతో ఆయన భార్య, కుమార్తె, కుమారుడు ఆధారాన్ని కోల్పోయి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పిల్లల విద్యాభ్యాసం, కుటుంబ పోషణ వంటి బాధ్యతలు భారంగా మారిన నేపథ్యంలో సమాజంలోని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని పంచాయతీ కార్యదర్శి కంచర్ల గౌతమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ విజ్ఞప్తికి స్పందించిన ఆరెగూడెం సర్పంచ్ శ్యాంసుందర్ వెంటనే రూ.10 వేల ఆర్థిక సాయం అందించి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన సేవాభావాన్ని అభినందించారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యత అని, మరికొందరు కూడా తమ వంతు సహాయం అందించాలని పిలుపునిచ్చారు.
బాలరాజ్ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దాతలు ముందుకు రావాలని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సర్పంచ్ శ్యాంసుందర్ చేసిన ఈ సహాయం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి